సిటీబ్యూరో, సెప్టెంబర్ 1(నమస్తే తెలంగాణ): ట్రాఫిక్ పోలీసులు ఉపయోగిస్తున్న ఐటీఎంఎస్ (ఇంటలిజెన్స్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్)తో దొంగతనానికి గురైన 7 వాహనాల కేసులను ఛేదించారు.
మేడిపల్లి, ఎల్బీనగర్, ఘట్కేసర్, సరూర్నగర్, కుషాయిగూడ, ఇబ్రహీపట్నం తదితర పోలీస్స్టేషన్లలో నమోదైన వాహనాల చోరీ కేసులకు సంబంధించి, హైదరాబాద్ ట్రాఫిక్ ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ నర్సింగ్రావు బృందం ఇచ్చిన సమాచారంతో ఆయా కేసులను స్థానిక పోలీసులు ఛేదించారు.