హైదరాబాద్: హైదరాబాద్లోని ట్యాంక్బండ్ (Tank Bund) పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ (Traffic Jam) అయింది. దుర్గామాత నిమజ్జనాల (Durga Mata Immersion) కోసం పెద్ద సంఖ్యలో వాహనాలు హుస్సేన్సాగర్ (Hussain Sagar) తీరానికి తరలివచ్చాయి. దీంతో సెక్రటేరియట్ రోడ్డు, నెక్లెస్ రోడ్, తెలుగుతల్లి ఫ్లై ఓవర్, టెలిఫోన్ భవన్ రోడ్డు వరకు వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ట్యాంక్బండ్ పరిసరాలన్నీ కిక్కిరిసిపోవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు.
కాగా, దుర్గామాత నిమజ్జనాల కోసం ట్యాంక్బండ్ చుట్టూ 11 క్రేన్లను ఏర్పాటు చేశారు. ఈ నెల 23 నుంచి కొనసాగుతున్న దుర్గా విగ్రహాల నిమజ్జనాలు నేటితో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో హుస్సేన్సాగర్ ప్రాంతంలో అధికారులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.