హైదరాబాద్: హైదరాబాద్లోని లక్డీకాపూల్-అసెంబ్లీ ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. దసరా సెలవులు ముగియడంతో భారీ సంఖ్యలో ట్రావెల్స్ బస్సులు నగరానికి చేరుకుంటున్నాయి. దీంతోపాటు దుర్గా మాత నిమజ్జనం కొనసాగుతుండటంతో పెద్దసంఖ్యలో విగ్రహాలు ట్యాంక్బండ్కు తరలివస్తున్నాయి. ఈక్రమంలో లక్టీకాపూల్ నుంచి అసెంబ్లీ మార్గంలో రోడ్డుకి రెండు వైపులా వాహనాలు నెమ్మదిగా కదులుతుండటంతో ట్రాఫిక్ జాం అయింది. దీంతో పోలీసులు ట్రాఫిక్ను క్లియర్ చేస్తున్నారు.