Traffic Restrictions | హైదరాబాద్ : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా రాజ్భవన్లో గవర్నర్ మంగళవారం సాయంత్రం 5 గంటలకు ‘ఎట్ హోం’ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి భారీ సంఖ్యలో ప్రముఖులు హాజరవుతారని, ఈ సందర్భంగా రాజ్భవన్ పరిసరాలలో ట్రాఫిక్ రద్దీ ఏర్పడుతుందని నగర ట్రాఫిక్ అదనపు సీపీ సుధీర్బాబు తెలిపారు. ఈ నేపథ్యంలో రాజ్భవన్ రోడ్డులో వెళ్లే వాహనదారులు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ప్రత్యామ్నాయ రూట్లలో వెళ్లాలని సూచించారు.
-వీవీఐపీఎస్లైన ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంలు, హైకోర్టు చీఫ్ జస్టీస్, శాసన మండలి ఛైర్మన్, స్పీకర్, కేంద్ర, రాష్ర్టాల మంత్రులకు సంబంధంచిన వాహనాలు గేట్ నెం.1 నుంచి రాజ్భవన్లోకి వెళ్లి, గేట్-2 నుంచి బయటకు రావాలి. ఈ వాహనాలను రాజ్భవన్ లోపల పార్కు చేయాలి.
-పింక్ కారు పాస్ కల్గిన ఇతర అతిథులు, గేట్ నెం.3 నుంచి లోపలికి వెళ్లి, లోపలే పార్కు చేయాలి. అదే గేట్ నుంచి బయటకు వెళ్లాలి. -వైట్ కారు పాసు కల్గిన వారు గేట్ నెం.3 నుంచి ప్రవేశించి, వారి వాహనాలను ఎంఎంటీఎస్ పార్కింగ్ లాట్, ఎంఎంటీఎస్ సమీపంలోని పార్క్ హోటల్, మెట్రో రెసెడిన్సీ నుంచి నాసర్ స్కూల్ వరకు సింగిల్ లైన్, లేక్ వ్యూ గెస్ట్ హౌస్ ఎదరుగా సింగిల్ లైన్లో పార్కింగ్ చేసుకోవాలి.