బేగంపేట్ మార్చి 10: రోడ్డు ప్రమాదాలను నివారించడం అందరి బాధ్యత అని ట్రాఫిక్ అదనపు పోలీస్ కమిషనర్ జి సుధీర్బాబు అన్నారు. బేగంపేట్లోని ట్రాఫిక్ శిక్షణా కేంద్రాన్ని ఆయన శుక్రవారం సందర్శించారు. ఈ క్రమంలో సుమారు 4 వందల మంది వివిధ కళాశాలలకు చెందిన ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ క్యాడెట్స్లో ముఖాముఖిగా సుధీర్బాబు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రోడ్డు ప్రమాదాలను నివారించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఒక్కరికి ట్రాఫిక్ నిబంధనలు తెలిసి ఉండాలని సూచించారు.
అర్హులైన వారు మాత్రమే డ్రైవిం గ్ లెసెన్స్ తీసుకోని వాహనాలు నడపాలని చెప్పారు. ట్రాఫిక్ వలంటీర్లుగా పని చేసేందుకు ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థ్ధులు ముందుకు రావడం ఎంతో అభినందనీయమన్నారు. ఈ క్రమంలో ఎన్సీసీ విద్యార్థులు వారికి ఉన్న సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ క్రమంలో ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విద్యార్థులకు హెల్మెట్స్ను అందించారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ అదనపు డీసీపీ రంగారావు, టీటీఐ ఏసీపీ శంకర్రాజు, ఇన్స్పెక్ట్టర్ నాగరాజ్,సిబ్బంది హీరో పార్కు నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు.
సెల్ఫోన్లో మాట్లాడుతూ వాహనాలు నడుపుతుండడం ఫ్యాషన్గా మారిందని బేగంపేట్ ట్రాఫిక్ ట్రైనింగ్ సెంటర్ ఏసీపీ జి.శంకర్రాజు పేర్కొన్నారు. ఇటువంటి విన్యాసాలతో వారితో పాటు ఎదుటి వారి వాహనాలు కూడా ప్రమాదానికి లోనవుతుంటాయని వివరించారు. రాంగ్ రూట్, సిగ్నల్ జింపింగ్ వంటి తొందర పాటు చర్యలతో వాహనదారులు ప్రాణాలు కోల్పోతుండడం విచారకరమన్నారు.