జూబ్లీహిల్స్, ఫిబ్రవరి 8 : వివాహాలకు ముహూర్థం సమీపిస్తుండడంతో దేశ నలుమూలల నుంచి సమకాలిన ఫ్యాషన్, ఆభరణాల అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించడానికి వెడ్డింగ్ ఆసియా సిద్ధంగా ఉన్నదని వెడ్డింగ్ ఆసియా వ్యవస్థాపకుడు, డైరెక్టర్ మణిందర్ సేథి పేర్కొన్నారు. శుక్రవారం నుంచి రెండు రోజుల (ఫిబ్రవరి 9,10) పాటు నగరంలోని హోటల్ పార్క్ హయత్లో ఎంపికచేసిన డిజైనర్లు, మిరుమిట్లు గొలిపే ఆభరణాలు, సొగసైన ఉపకరణాల ప్రదర్శనను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
వివాహాలకు ముహూర్థం సమీపిస్తుండడంతో దేశ నలుమూలల నుంచి సమకాలిన ఫ్యాషన్, ఆభరణాల అత్యుత్తమ ప్రతిభను ప్రదర్శించడానికి వెడ్డింగ్ ఆసియా సిద్ధంగా ఉన్నదని వెడ్డింగ్ ఆసియా వ్యవస్థాపకుడు, డైరెక్టర్ మణిందర్ సేథి పేర్కొన్నారు.నగరంలో గత 17 సంవత్సరాలుగా వివాహ ప్రదర్శన పరిశ్రమలో అగ్రగామిగా ఉన్న వెడ్డింగ్ ఆసియా ఇప్పటివరకు 175కు పైగా అద్భుతమైన ప్రదర్శనలతో లక్షలాది కుటుంబాలలో కల్యాణ కాంతులు నింపిందన్నారు. ఈ ప్రదర్శనలో ప్రముఖ జ్యువెల్లర్స్, ప్రతిభావంతులైన డిజైనర్లు పాల్గొంటారని, వధూవరుల కలలను సాకారం చేసే ఈ ప్రదర్శనను కుటుంబ సమేతంగా సందర్శించాలని కోరారు.