సిటీబ్యూరో, డిసెంబర్ 8 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ ఉపాధ్యాయ శాసన మండలి నియోజకవర్గం ఓటరు నమోదును ఈ నెల 9వ తేదీలోగా చేసుకోవాలని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఒక ప్రకటనలో తెలిపారు. శాసన మండలి ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ముసాయిదా ఓటరు జాబితాను నవంబర్ 23న ప్రకటించిన నేపథ్యంలో జాబితాలో పేర్లు తప్పుల సవరణకు, అర్హత ఉండి ఇప్పటి వరకు నమోదు చేసుకోనివారు నమోదుకు డిసెంబర్ 9 నాటికి తుదిగడువు ఉందని తెలిపారు.
ఓటరు నమోదు కోసం ఫారం-19, అభ్యంతరాలు, పేరు తొలగించడం కోసం ఫారం- 7, తప్పొప్పుల సవరణకు ఫారం-8 ద్వారా అందజేయవచ్చని, ఇతర వివరాలకు అసిస్టెంట్ ఎలక్ట్రోల్ అధికారి లేదా డిజిగ్నెట్ అధికారిని సంప్రదించాలన్నారు. ఆన్ లైన్ ద్వారా ceo.telanga na.nic.in నమోదు చేసుకోవచ్చునని, ఎయిడెడ్, అన్ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాల ఉపాధ్యాయులు సంబంధిత అధికారితో కౌంటర్ సిగ్నేచర్ చేసిన ధృవీకరణ పత్రాలు జత చేయాల్సి ఉంటుందని తెలిపారు.