సైదాబాద్, మార్చి 9 : ప్రాచీన శాసనాల్లోని విజ్ఞానాన్ని భావితరాలకు అందించాలని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ మెడికల్ హెరిటేజ్ సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ జీపీ ప్రసాద్ అన్నారు. ఎస్టామ్ పేజ్ (శిలాశాసనాలు అచ్చు తీసుకునే పద్ధతి)పై శిక్షణ సదస్సును జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పురాతన కాలంలో రాజులు, చక్రవర్తులు, జమీందారులు తమ రాజ్య అధికార శాసనాలను, వైద్య వారసత్వ సంపదను రాళ్లపై, రాతి బండలపై, రాగి రేకులపై చెక్కించి భద్రపరిచే వారిని తెలిపారు.
వాటిని జాగ్రత్తగా భద్రపరుస్తూ అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీసీఆర్ఎస్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ శ్రీకాంత్, జి.వెంకటరత్నం, డాక్టర్ వైఎస్ఆర్ స్టేట్ మ్యూజియం హెరిటేజ్ విభాగం డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ నాగరాజు, డాక్టర్ రాములు నాయక్, ఎన్ గిరిధర్, డాక్టర్ శ్రీదేవి, సంతోష్ మానే, క్రిస ఆంటోని, బిశ్వ రంజన్ దాస్ తదితరులు పాల్గొన్నారు.