సుల్తాన్బజార్ : ప్రభుత్వ శాఖలలో విధులు నిర్వహిస్తున్న రెగ్యులర్ ఉద్యోగులతో పాటు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు టీఎన్జ్జీవో హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎస్ఎం ముజీబ్హుస్సేనీ అన్నారు.
ఈ మేరకు మంగళవారం ప్రొఫెసర్ జయశంకర్ సార్ వ్యవసాయ విశ్వ విద్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఔట్ సోర్సింగ్ జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ ఉద్యోగి కరోనాతో పాటు బ్లాక్ ఫంగస్ బారిన పడి మృతి చెందిన కె నవీన్ కుమార్ భార్యకు ఆర్ధిక సహాయాన్ని ఆయన వర్సిటీ వీసీ ప్రవీణ్కుమార్తో కలిసి అందజేశారు.
ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రొఫెసర్ జయశంకర్ విశ్వ విద్యాలయంలో విధులు నిర్వహిస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగి మృతి చెందడంతో తోటి ఉద్యోగులు తమ వంతు సహాయంగా 41 వేల 200 రూపాయలు,అసద్ అన్వర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పది వేల రూపాయలను మొత్త్తంగా 51 వేల 200 రూపాయల చెక్కును అందజేయడం జరిగిందన్నారు.
వర్సిటీలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల సమస్యలను పరిష్కరిస్తున్న వర్సిటీ వీసీ డాక్టర్ వి ప్రవీణ్రావుకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా శాఖ కార్యదర్శి ఎస్ విక్రమ్కుమార్,ఉపాధ్యక్షుడు కేఆర్ రాజ్కుమార్,ప్రచార కార్యదర్శి కురాడి శ్రీనివాస్,సభ్యులు ఖాలేద్ అహ్మద్,శంకర్,వైదిక్ శస్త్ర,శ్రీధర్నాయుడుతో పాటు యూనిట్ అధ్యక్ష,కార్యదర్శులు,ప్రాథమిక సభ్యులు తదితరులు పాల్గొన్నారు.