కాప్రా/మల్లాపూర్, ఏప్రిల్ 9 : రంజాన్ను ముస్లింలు సంతోషంగా జరుపుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం రంజాన్కు తోఫాలను అందజేస్తున్నదని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. కాప్రాడివిజన్ జామియా మసీదులో ఆదివారం ఏర్పాటు చేసిన రంజాన్ తోఫాల పంపి ణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా విచ్చేసి తోఫాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం అన్నివర్గాల సంక్షేమం కోసం పాటుపడుతున్నదని తెలిపారు. కార్యక్రమంలో కాప్రా డివిజన్ కార్పొరేటర్ స్వర్ణరాజు, మాజీ కార్పొరేటర్ ధన్పాల్రెడ్డి, ఉప్పల్ నియోజకవర్గం బీఆర్ఎస్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు బద్రుద్దీన్, డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు సుడుగు మహేందర్రెడ్డి, గిల్బర్ట్, వంశరాజ్మల్లేశ్, సా యిరాం, శివకుమార్, వస్ర్తాల వెంకటేశ్, లింగం, దేవి, సరోజ, గణేశ్, రాకేశ్, ముస్లిం సోదరులు ఎండీ గౌస్, కా జా పట్వారి, సలీంబాయ్, బబ్బులు భాయ్, రఫీక్, చాంద్ తదితరులు పాల్గొన్నారు.
మల్లాపూర్లో ..
రంజాన్ పండుగను పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ముస్లింలకు దు స్తులను పంపిణీ చేయడం చాలా సంతోషకరమైన విషయమని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన మల్లాపూర్ డివిజన్ పరిధి అశోక్నగర్ మసీద్లో ముస్లింలకు స్థానిక కార్పొరేటర్ పన్నాల దేవేందర్రెడ్డితో కలిసి రంజాన్ కానుకలు అందజేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీనారాయణ, మైనార్టీ నాయకులు భాసిత్ఖాన్, జాకీర్అలీ, చాంద్పాష, ఉమర్, ఆఫీస్, షరీఫ్, నోమాన్, జహంగీర్, అహ్మద్, ఫయాజ్, అనాజ్, మస్తాన్, రఘు, ప్రవీణ్, రమణ, రాము తదితరులు పాల్గొన్నారు.
ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలి..
పేద ప్రజలు నివసించే ప్రాంతాల్లో కార్పొరేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు ఉచిత వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. ఆదివారం కాప్రా డివిజన్ వంపుగూడ ప్రభుత్వ పాఠశాల సమీపంలో కాప్రాకు చెందిన జెమ్కేర్ పౌలోమి హాస్పిటల్ వారు ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరానికి ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రారంభించారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ స్వర్ణరాజు, ఉప్పల్ బీఆర్ఎస్ మైనారిటీ సెల్ అధ్యక్షుడులు బద్రుద్దీన్, డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు సుడుగు మహేందర్రెడ్డి, గిల్బర్ట్, శ్రీనివాస్, మల్లేశ్ వంశరాజ్, వస్ర్తాల వెంకటేశ్, మల్లారెడ్డి, సంతోష్కుమార్, బాబూరావు, గణేశ్, శివకుమార్ పాల్గొన్నారు.