కందుకూరు : ట్యాంకర్ను టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పలువురు ప్రాణాపాయం నుండి బతికి బయట పడ్డారు. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం ఆదివారం సాయంత్రం కడ్తాల్ వైపు నుండి పాలను తీసుకొని హైదరాబాదు వైపు వస్తున్న ట్యాంకర్, కందుకూరు గేటు వద్దకు రాగానే తుక్కుగూడ నుంచి కడ్తాల్ వైపు వస్తున్న టిప్పర్ ట్యాంకర్ను ఢీకొట్టి అదుపుతప్పి రొడ్డుపై వెలుతున్న ద్వీచక్ర వాహన దారులను డీకట్టడంతో వారికి తీవ్రగాయాలు అయ్యాయి.
ట్యాంకర్ రోడ్డుపై బొల్తా కొట్టగా, టీప్పర్ రోడ్డు కిందకు దూసుకెళ్లింది. రోడ్డు మీద వెళ్తున్న వారు అప్రమత్తమవ్వడంతో పలువురు ప్రాణపాయం నుండి బతికి బయట పడ్డారు. విషయం తెలిసిన వెంటనే కందుకూరు పోలీసులు సంఘన స్థలానికి చేరుకొని రొడ్డుపై పడిఉన్న ట్యాంకర్ను పక్కకు తీశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.