హైదరాబాద్: మితిమీరిన వేగం, నిర్లక్ష్యానికి ముగ్గురు యువకులు బలయ్యారు. రాజేంద్రనగర్లోని శివరాంపల్లి వద్ద ఆరాంఘర్ ఫ్లైఓవర్పై (Aramghar Flyover) ఓ బైక్ డివైడర్ను ఢీకొట్టింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా, మరొకరు దవాఖానలో ప్రాణాలు కోల్పోయారు. మృతులను బహదూర్పురా, తలాబ్కట్టకు చెందినవారిగా గుర్తించారు.
మంగళవారం తెల్లవారుజామున బహదూర్పురాకు చెందిన అహ్మద్, మాజ్ ఖాద్రి, తలాబ్కట్టకు చెందిన సయీద్ అనే ముగ్గురు ఆరాంఘర్ ఫ్లైఓవర్పై బహదూర్పురా నుంచి ఆరాంఘర్ వైపు ఒకే స్కూటర్పై వెళ్తున్నారు. స్టంట్లు చేస్తూ అతివేగంతో దూసుకెళ్తున్నారు. ఈ క్రమంలో శివరాంపల్లి సమీపంలోకి రాగానే అదుపుతప్పి ఫ్లైఓవర్పై ఎలక్ట్రిక్ పోల్ను ఢీకొట్టింది. అనంతరం అది డివైడర్ వైపు దూసుకెళ్లింది. దీంతో తీవ్రంగా గాయపడంతో ఇద్దరు ఘటనా స్థలంలో మరణించారు. మరొకరు హాస్పిటల్లో చనిపోయారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతులు మైనర్లని వెల్లడించారు.