హైదరాబాద్: నగరంలోని జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు గాయపడ్డారు. బుధవారం తెల్లవారుజామున పంజాగుట్ట (Panjagutta) నాగార్జున సర్కిల్లో ఓ కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న వ్యక్తికి స్వల్పంగా గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారును అక్కడి నుంచి తొలగించి స్టేషన్కు తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరో ఘటనలో పటాన్చెరు శివార్లలోని ఔటర్ రింగ్రోడ్డుపై కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు టనా స్థలానికి చేరుకని.. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. బాధితులకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉన్నది.