హైదరాబాద్ : మొన్న హరీష్ రావుకు, ఇవాళ కేటీఆర్కు నోటీసులు( Notice ) ఇవ్వడం రాజకీయ కక్షసాధింపు చర్యేనని తలసాని సాయి కిరణ్ యాదవ్ (Talasani Kiran Yadav) అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పాలనను వదిలేసి, ప్రతిపక్ష నేతలను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా పెట్టుకుందని విమర్శించారు.
మున్సిపల్ ఎన్నికల వేళ ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఇటువంటి నోటీసులు ఇస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో యూరియా దొరకక రైతులు అల్లాడుతున్నా, రైతు భరోసా ఊసే లేదని ధ్వజమెత్తారు.ఫోన్ ట్యాపింగ్, ఫార్ములా ఈ-రేస్ వంటి కేసుల్లో ఎలాంటి ఆధారాలు లేవని, రెండేళ్లుగా దర్యాప్తు చేసినా ఏమీ తేల్చలేకపోయారని ఎద్దేవా చేశారు.
రేవంత్ రెడ్డి సర్కారు ఆడించినట్లు పోలీస్ యంత్రాంగం ఆడటం విచారకరమని అన్నారు.ముఖ్యమంత్రి దావోస్లో విహరిస్తుంటే, ఇక్కడ అక్రమ అరెస్టులు, విచారణలతో కాలక్షేపం చేస్తున్నారని విమర్శించారు. ఎన్ని కేసులు పెట్టినా, ఎన్ని నోటీసులు ఇచ్చినా వాటన్నింటినీ న్యాయపరంగా ఎదుర్కొంటామని స్పష్టం చేశారు.