రంగారెడ్డి : రాచకొండ పోలీసు కమిషనరేట్ అబ్దుల్లాపూర్ మెట్ పోలీసు స్టేషన్ పరిధిలోని సాయిబాబా ఆలయంలో చోరీ జరిగింది. ఆలయంలోని హుండీని పగులగొట్టి.. అందులో ఉన్న నగదును అపహరించారు. ఆ హుండీలో సుమారు రూ. 25 వేల వరకు నగదు ఉన్నట్లు తెలుస్తోంది. బుధవారం ఉదయం ఆలయ పూజారి వచ్చి చూడగా.. హుండీని పగులగొట్టిన దృశ్యాలు కనిపించాయి. దీంతో పూజారి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.