మెహిదీపట్నం ఆగస్టు 15: దొంగతనం కేసులో విచారణ కోసం తీసుకొచ్చిన ఓ అనుమానితుడు భయంతో పోలీస్స్టేషన్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు యత్నించాడు. ఆసిఫ్నగర్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం…బీహార్కు చెందిన వాజీద్ ఆసిఫ్నగర్ రవీందర్నగర్లో గ్యాస్ గోడౌన్ను నిర్వహిస్తున్నాడు. జూలై 31న దానికి తాళం వేసి ఊరికివెళ్లాడు. ఆగస్టు 11న తిరిగి వచ్చిన వాజీద్ గోడౌన్లో పెట్టిన సుమారు రూ. 6 లక్షలు చోరీకి గురైనట్లు గుర్తించాడు. ఆసిఫ్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆదివారం ఉదయం వాజీద్ తన వద్ద పనిచేసే ఐదుగురిని అనుమానిస్తూ..ఆసిఫ్నగర్ పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చాడు. రెండో అంతస్తులో ఉన్న క్రైం విభాగంలో ఖాలీద్, సల్మాన్లతో పాటు మరో ముగ్గురిని పోలీసులు విచారించారు. ఈ క్రమంలో సల్మాన్ మధ్యాహ్నం అక్కడి నుంచి కిందకు దూకేశాడు. తీవ్రంగా గాయపడిన అతడిని పోలీసులు వెంటనే చికిత్స కోసం ఉస్మానియాకు తరలించారు. జాయింట్ కమిషనర్, పశ్చిమ మండలం డీసీపీ ఏఆర్ శ్రీనివాస్ పోలీస్ స్టేషన్కు చేరుకుని విచారణ చేపట్టారు. సల్మాన్కు ప్రాణాపాయం లేదన్నారు.