కాచిగూడ : కొచింగ్కు వెళ్లిన యువతి అదృశ్యమైన సంఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఎస్సై మహేశ్ తెలిపిన వివరాల ప్రకారం కాచిగూడ డివిజన్లోని ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నింబోలిఅడ్డా ప్రాంతానికి చెందిన వెంకటయ్య కుమార్తె వి.నందిని (19) ఉన్నత చదువుల కోసం సికింద్రాబాద్లో కోచింగ్ తీసుకుంటుంది.
ఈ నెల 25న ఉదయం కోచింగ్కు వెళ్లి వస్తానని కుటుంబ సభ్యులకు చెప్పి వెళ్లిన నందిని ఇప్పటికీ తిరిగి రాకపోవడంతో కలత చెందిన కుటుంబ సభ్యులు ఇరుగు పొరుగు ఇండ్లల్లో వెతికినా ఆచూకి లభించకపోవడంతో తండ్రి వెంకటయ్య మంగళవారం కాచిగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.
ఇంట్లోంచి నందిని వెళ్లే సమయంలో నలుపు,తెలుపు రంగు చూడీదార్ పైజమా ధరించి ఉన్నట్లు పోలీసులు తెలిపారు. తండ్రి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కాచిగూడ పోలీసులు తెలిపారు.