హైదరాబాద్ : మైలార్దేవ్పల్లిలో దొంగలు(Thugs) రెచ్చిపోయారు. విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై దాడికి పాల్పడి పరారయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. విధుల్లో భాగంగా ఎక్సైజ్ పోలీసులు(Excise police) తనిఖీలు చేపట్టారు. గంజాయి తరలిస్తున్నారనే అనుమానంతో జల్పల్లి దగ్గర ఓ బైక్ను ఆపి సోదా చేస్తుండగా ఇద్దరు దుండగలు ఎక్సైజ్ పోలీసులపై పెప్పర్ స్ప్రే(pepper spray) కొట్టి పారిపోయారు. నిందితుల వద్ద నుంచి బైక్, నకిలీ తుపాకీ, రెండు కత్తులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.