సిటీబ్యూరో, మే 17 (నమస్తే తెలంగాణ)/జూబ్లీహిల్స్ : విశ్వ నగరంగా ఎదుగుతున్న హైదరాబాద్ను మురికివాడలు లేని నగరంగా మార్చాలన్న సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల నిర్మాణాన్ని చేపట్టింది. ఇందులో భాగంగానే జూబ్లీహిల్స్ నియోజకవర్గం కమలానగర్లో రూ.1785 లక్షల అంచనా వ్యయంతో చేపట్టిన 210 డబుల్ బెడ్ రూం ఇండ్ల నిర్మాణ సముదాయాన్ని గురువారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్థానిక ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్తో కలిసి ప్రారంభించనున్నారు.
210 డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణానికి మొత్తం రూ.16 కోట్ల 27 లక్షల 50 వేలు ఖర్చు చేయగా, రూ.15.50 లక్షల వ్యయంతో మౌలిక సదుపాయాలు కల్పించారు. ఈ కాలనీకి లక్ష లీటర్ల సామర్థ్యం కలిగిన వాటర్ ట్యాంక్, విద్యుత్ సౌకర్యంతో పాటు 15 దుకాణాలను ఏర్పాటు చేశారు. ఒక్కొక్కటి 560 ఎస్ఎఫ్టీ విస్తీర్ణంలో రూ.7.75 లక్షల వ్యయంతో నిర్మించారు. ఈ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు డిగ్నిటీ కాలనీగా నామకరణం చేశారు.