కేపీహెచ్బీ కాలనీ, డిసెంబర్ 8 : భవిష్యత్లో మానవజాతి మనుగడ సాగించాలంటే నైపుణ్యం కలిగిన ఫార్మిస్టుల సేవలు ఎంతో అవసరమని జేఎన్టీయూహెచ్ వైస్ ఛాన్స్లర్ కట్టా నరసింహారెడ్డి అన్నారు. జేఎన్టీయూహెచ్ అవెనిడ ఇన్నోవేషన్, మల్లారెడ్డి ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ సైన్సెస్ సంయుక్తాధ్వర్యంలో ఛేంజింగ్ వరల్డ్ ఆఫ్ హెల్త్కేర్ అనే అంశంపై నిర్వహించిన రెండురోజుల అంతర్జాతీయ సదస్సు గురువారం వర్సిటీ ఆడిటోరియంలో ప్రాంభమైంది.
ఈ సదస్సు ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా వర్సిటీ వైస్ ఛాన్సలర్ కట్టా నరసింహారెడ్డి, అవెనిడ ఇన్నోవేషన్ ప్రెసిడెంట్ అశ్వినీ దార్, రెక్టార్ గోవర్ధన్, రిజిస్ట్రార్ మంజూర్ హుస్సేన్, ప్రత్యేక ఆహ్వానితులు బి.ప్రభాశంకర్, సెంటర్ ఆఫ్ వాటర్ రీసోర్స్ ఇన్చార్జి ప్రిన్సిపాల్ సీహెచ్.సరళ, మల్లారెడ్డి సంస్థ ప్రతినిధి రాజ్కమల్, ప్రోగ్రామ్ కో ఆర్డినేటర్ ఎం.సునీతారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఫార్మా రంగంలో విస్తృత అవకాశాలున్నాయని విద్యార్థులు నైపుణ్యాలను పెంపొందించుకుని నూతన ఆవిష్కరణలు చేపట్టాలన్నారు. ప్రస్తుత సమాజంలో ఆరోగ్య సంరక్షణ కోసం ఫార్మా రంగంలో పలు సంస్కరణలు వస్తున్నాయని ఫార్మిస్టులు ఆరోగ్య సంరక్షకుల బృందంలో ఒకరుగా ఉంటారన్నారు. ఫార్మిస్టులు నూతన సవాళ్లను ఎదుర్కొనే దిశగా పరిశోధనలు సాగించాలన్నారు. కార్యక్రమంలో దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రతినిధులు పాల్గొన్నారు.