సిటీబ్యూరో, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో అప్పుడే ఎండలు మొదలయ్యాయి.. ఉదయం, రాత్రి వేల వాతావరణం కొంత చల్లగా ఉన్నప్పటికీ మధ్యాహ్నం సమయంలో మాత్రం ఎండల తీవ్రత అధికంగా ఉంటోంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే పెరుగుతున్నాయి.
గురువారం గ్రేటర్లో గరిష్ఠం సాధారణ స్థాయి కంటే 1.3డిగ్రీలు పెరిగి 32.3డిగ్రీలు, కనిష్ఠం 1.4 పెరిగి 19.4డిగ్రీలు, గాలిలో తేమ 26శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలున్నట్లు తెలిపారు.