సుల్తాన్బజార్, డిసెంబర్ 20: నిజాం కళాశాల లేడీస్ హాస్టల్లో సరైన వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటూ విద్యార్థులు తరగతులను బహిష్కరించారు. రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. కళాశాల లేడీస్ హాస్టల్లో వసతులను తక్షణమే కల్పించాలంటూ బుధవారం విద్యార్థులు ఆందోళన బాటపట్టిలోని బాబూజగ్జీవన్రాం విగ్రహం వద్ద రోడ్డుపై బైఠాయించి, నిరసన వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా విద్యార్థులు మాట్లాడుతూ.. హాస్టల్లోని సమస్యలను పరిష్కరించాలని ప్రిన్సిపాల్ భీమాను ఎన్ని మార్లు వేడుకున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్క బెడ్పై ముగ్గురు విద్యార్థులు ఎలా ఉంటారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రిన్సిపాల్ స్పందించి సమస్యలను పరిష్కరించాలని కోరారు.