బంజారాహిల్స్,సెప్టెంబర్ 7: టీఆర్ఎస్ పార్టీకి కష్టపడి పనిచేస్తున్న కార్యకర్తలే బలమని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. జలవిహార్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ పార్టీ విస్త్రత స్థాయి సమావేశానికి ఖైరతాబాద్ నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు, కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే దానం నాగేందర్ వెళ్లారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ర్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ను వెన్నంటి నడిపిస్తున్న టీఆర్ఎస్ కార్యకర్తల వల్లనే పార్టీ ఎదురులేని శక్తిగా మారిందన్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలంగా మార్చేందుకు త్వరలోనే బస్తీ కమిటీలు, డివిజన్ కమిటీలతో పాటు అన్ని కమిటీల ఏర్పాటు పూర్తి చేస్తామని వెల్లడించారు.
పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలకు సరైన గుర్తింపు ఉంటుందన్నారు.
కమిటీ ఏర్పాటులో అన్ని వర్గాలకు ప్రాధాన్యత ఉండేలా చూస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు మామిడి నర్సింగరావు తదితరులు పాల్గొన్నారు.