కేపీహెచ్బీ కాలనీ, ఆగస్టు 30 : కండ్లెదుటే కనబడుతున్న అభివృద్ధికి ఆకర్షితులై పలు పార్టీల నేతలు బీఆర్ఎస్లో చేరుతున్నారని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. బుధవారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సమక్షంలో కేపీహెచ్బీ కాలనీ కార్పొరేటర్ మందడి శ్రీనివాస్రావు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు రాంబాబునాయుడు ఆధ్వర్యంలో కేపీహెచ్బీ కాలనీ కాంగ్రెస్, బీజేపీలకు చెందిన 50మంది నేతలు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రం అగ్రగామిగా అభివృద్ధి సాధించిందని.. పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయన్నారు. నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, పేదలకు అందుతున్న సంక్షేమ పథకాలు ప్రజలందరూ గమనిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ పార్టీ నేతలు పాల్గొన్నారు.