రవీంద్రభారతి, ఆగస్టు 9: స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా ప్రతిఒక్కరూ సామాజిక కార్యక్రమాల్లో పాల్గొని భారత స్వాతంత్య్ర స్ఫూర్తిని, దేశ సమైక్యతను చాటాలని రైతు ఉద్యమ నేత, ఓసీ సామాజిక సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు పిలుపునిచ్చారు. ఓసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా మూడు లక్షల మొక్కలను నాటనున్నట్టు చెప్పారు.
మంగళవారం బషీర్బాగ్లో ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఉమ్మడి జిల్లాకు 30 వేల చొప్పున 3 లక్షల మొక్కలను నిర్వాహకులకు పంపిణీ చేసినట్టు తెలిపారు. సమావేశంలో చందుపట్ల నర్సింహారెడ్డి, బస్సా శ్రీనివాస్, వల్లూరి పవన్కుమార్, గంగవరపు రామకృష్ణప్రసాద్, తాడిశెట్టి పశుపతి, సరిగాని ఎల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.