హయత్నగర్, సెప్టెంబర్ 2 : కరోనా సమయంలో మున్సిపల్ కార్మికుల సేవలు అభినందనీయమని హయత్నగర్ డివిజన్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్రెడ్డి కొనియాడారు. గురువారం హయత్నగర్ డివిజన్లో పనిచేసే ఫాగింగ్, మలేరియా డిపార్ట్మెంట్ సిబ్బందికి కార్పొరేటర్ చేతుల మీదుగా కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా కాలంలో తమ ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించారని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సిబ్బందికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని కోరారు. మున్సిపల్ కార్మికులకు ఆరోగ్య భద్రత కార్డులు జారీచేయాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఎంటమాలజీ ఏఈ రవీందర్రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.