అంబర్పేట: కొవిడ్ సమయంలో ఆశా వర్కర్లు చేసిన సేవలు వెలకట్టలేనివని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అన్నారు. మహిళా బంధులో భాగంగా సోమవారం బాగ్అంబర్పేట డివిజన్ యూపీహెచ్సీ ఆవరణలో ఆశా వర్కర్లు, మహిళా సిబ్బందికి ఎమ్మెల్యే బహుమతులను అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆశా వర్కర్లు గత రెండేళ్లుగా కొవిడ్ సమయంలో చాలా బ్రహ్మాండంగా పని చేశారన్నారు. సీఎం కేసీఆర్ మహిళా సంక్షేమానికి అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని పేర్కొన్నారు.
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్రంలో మూడు రోజుల పాటు మహిళా బంధు కేసీఆర్ పేరిట మహిళా దినోత్సవ సంబురాలను జరుపుకోవడం ఎంతో సంతోషకరమన్నారు.
అనంతరం పలువురు ఆశావర్కర్లు మాట్లాడుతూ చాలీచాలని జీతాలతో ఇబ్బందులు పడుతున్న తమకు కేసీఆర్ జీతాలను పెంచి జీవితాల్లో వెలుగులు నింపారని సంతోషం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ కాలేరు దీప్తిపటేల్, వైద్య సిబ్బంది దేవకి, మాధురి, మన్యాల, టీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు సీహెచ్ చంద్రమోహన్, ఎస్.సులోచన, శ్రీరాములుముదిరాజ్, దిలీప్, శివాజీయాదవ్, నర్సింగ్, మహేష్, స్వర్ణ, అరుణ్కుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.