కందుకూరు, ఫిబ్రవరి 4 : రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఫార్మాసిటీ ఏర్పాటుకు భూములు ఇచ్చిన రైతుల త్యాగాలు వెలకట్టలేనివని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మండల పరిధిలోని అన్నోజిగూడ, ఆకులమైలారం, బేగరికంచె గ్రామాల రైతులకు రంగారెడ్డి జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డితో కలిసి మంత్రి శనివారం ఇండ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ… ఫార్మాసిటీ ఏర్పాటుతో పరిశ్రమలు పెద్ద ఎత్తున వస్తాయని, దీంతో ఉద్యోగ, ఉపాధి అవకాశాల లభిస్తాయని చెప్పారు.
ఈ ప్రాంతం ఘననీయమైన అభివృద్ధి చెందుతుందని తెలిపారు. 600 ఎకరాల్లో ఎచ్ఎండీఏ లే అవుట్ చేసి అన్ని వసతులను కల్పించి, ఉగాది వరకు ఇండ్ల స్థలాలను అప్పగిస్తామని కానీ అమ్ముకోవద్దని కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ బొక్క జంగారెడ్డి, ఎంపీపీ జ్యోతి పాండు, మార్కెట్ చైర్మన్ సురేందర్రెడ్డి,ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.