కాచిగూడ,మార్చి 2: ఇంటి ముందు పార్క్ చేసిన ద్విచక్రవాహనం మాయమైన సంఘటన కాచిగూడ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. డీఎస్సై వీర మల్లయ్య తెలిపిన వివరాల ప్రకారం.. కాచిగూడలోని ఇసామియాబజార్కు చెందిన చిన్నప్రసాద్ కుమారుడు లాల్మాన్(36)వృత్తిరీత్యా వ్యాపారం చేస్తున్నాడు.
కాగా, గత నెల 25వ తేదీన ఇంటి ముందు (ఏపీ 09 సీయూ 7718) హోండా ఆక్టివా ద్విచక్రవాహనాన్ని పార్క్ చేసి మరుసటి రోజు చూసేసరికి ద్విచక్రవాహనం కనబడలేదు. చుట్టుపక్కల, ఇతర ప్రాంతాల్లో వెతికినా ఆచూకీ లభించలేదు. బుధవారం లాల్మాన్ కాచిగూడ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కాచిగూడ పోలీసులు తెలిపారు.