శేరిలింగంపల్లి, మే 24: గోపన్పల్లిలో భాగ్యనగర్ మ్యుచువల్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న భూపోరాటం ఆదివారంతో 313వ రోజు కు చేరుకుంది. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోంచి తమ భూములను కాపాడి తమకు న్యాయం చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ పలువురు ఉద్యోగులు, పెన్షనర్లు ఆందోళనలో నిర్వహించారు. సొసైటీ ప్రెసిడెంట్ ముత్యాల సత్యనారాయణ గౌడ్, సెక్రెటరీ మల్లారెడ్డి, డైరెక్టర్లు ప్రభాకర్ రెడ్డి, దామోదర్, రషీదాబేగం, ఉద్యోగులు పాల్గొన్నారు.