వెంగళరావునగర్, ఆగస్టు 26 7 : టీ తాగేందుకు వెళ్లిన వృద్ధుడు అదృశ్యమైన సంఘటన ఎస్.ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఎస్సై రమేష్ కథనం మేరకు..ఎర్రగడ్డ, సుల్తాన్ నగర్లో నివసించే మహ్మద్ సిద్ధిక్ అలీ (70) ఉదయాన్నే టీ తాగే అలవాటు ఉండడంతో ఇంటి సమీపంలోని టీ షాపుకు వెళ్లేవాడు.
కాగా, రోజు మాదిరిగానే మంగళవారం ఉదయం కూడా టీ తాగేందుకు వెళ్లి అలీ ఇంటికి తిరిగిరాకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు తమ బంధువుల ఇళ్లతో పాటు పలు చోట్ల వెతికినా ఆచూకీ లభించపోవడంతో కుమారుడు ఖదీర్ పాషా ఎస్.ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని సిద్ధిక్ అలీ ఆచూకీ కోసం గాలిస్తున్నామని ఎస్సై తెలిపారు.