మైలార్దేవ్పల్లి,జనవరి31: దాతల సహాయ సహకారాలతో గణేశ్నగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అభివృద్ధిపథంలో ముందుకు సాగుతున్నది. 3వేల గజాల విశాలమైన స్థలంలో ఉన్న ఈ పాఠశాలలో ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు కలిసి దాతల సహకారంతో మౌలిక వసతులు కల్పించారు. 1996లో ఏకోపాధ్యాయ పాఠశాలగా ప్రారంభమై ప్రతి ఏటా విద్యార్థుల సంఖ్యను పెంచుకుంటూ, అప్ గ్రేడ్ అవుతూ ఉన్నత పాఠశాలగా గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం 423మంది విద్యార్థులు ఉన్నారు. ప్రధానోపాధ్యాయుడితో కలిపి 7 గురు ఉపాధ్యాయులు ఉన్నారు. రెండు సంవత్సరాలుగా 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఆంగ్లమాధ్యమం మొదలైంది.
ఇంగ్లీష్ మీడియానికి విద్యార్థుల తల్లిదండ్రులు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండడంతో ప్రస్తుతం ఒక
తరగితి గదులలో సుమారు 70 నుంచి 80 మంది విద్యార్థులు ఉన్నారు.
దాతల సహకారంతో..
విద్యార్థుల సంఖ్య పెరుగుతుంది
దాత సహాయంతో పాఠశాలకు కావలసిన పరికరాలు, స్టడీ మెటేరియల్ ,నూతన గదులు నిర్మించాం. మూడు సంవత్సరాలుగా విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఆంగ్లమాధ్యమం ఉండడంతో తల్లిదండ్రులు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్చుతున్నారు.ప్రభుత్వ పాఠశాలలు ప్రైవేటుకు దీటుగా నడుపాలంటే పాఠశాలలో అన్ని మౌలిక వసతులు కల్పించాలి. అప్పుడే విద్యార్థులు పోటీపడి చుదువుకుంటారు.