మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సోమవారం సాయంత్రానికి తెరపడింది. చివరి రోజు బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారాలతో హోరెత్తించారు. గల్లీగల్లీ తిరుగుతూ.. కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని, మోసపూరిత కాంగ్రెస్ను తరిమికొట్టాలని పిలుపునిస్తూ..ముందుకు సాగారు. కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలను వివరిస్తూ.. ఓట్లు అభ్యర్థించారు. మరోవైపు గులాబీ శ్రేణుల ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. కాంగ్రెస్ సర్కారుపై ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఓటుతోనే కాంగ్రెస్కు బుద్ధి చెబుతామని స్పష్టం చేశారు.
-మేడ్చల్