శంషాబాద్ రూరల్, మార్చి 24: తల్లీ, ఇద్దరు పిల్లలు అదృశ్యమయ్యారు. ఈ ఘటన ఆదివారం శంషాబాద్ రూరల్ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ నరేందర్రెడ్డి కథనం ప్రకారం.. ఊటుపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి రమాదేవి కూతురు కుమ్మరి స్వాతి(28)ని పదేండ్ల కిందట చౌదర్గూడ గ్రామానికి చెందిన రమేశ్కు ఇచ్చి పెండ్లి చేశారు. వారికి ఇద్దరు పిల్లలు. ఆరాధ్య(7), యశ్విత(5). మూడు నెలల కిందట స్వాతి దంపతుల మధ్య గొడవలు జరిగాయి. దీంతో ఆమె అప్పటి నుంచి తన ఇద్దరి పిల్లలతో కలిసి ఊటుపల్లి గ్రామంలోని పుట్టింటిలో ఉంటున్నది.
ఇదిలా ఉండగా.. శనివారం రాత్రి 11 గంటల సమయంలో ఇద్దరు పిల్లలు, తల్లి భోజనం చేసి నిద్రపోయారు. కుటుంబ సభ్యులు ఆదివారం ఉదయం నిద్రలేచి చూడగా.. తల్లీ, ఇద్దరు పిల్లలు కనిపించలేదు. ఉదయం నుంచి ఎక్కడ వెతికినా ఫలితం లేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ తెలిపారు.