చల్లని సాయంత్రాన.. సాగర తీరంలో చుట్టూ పచ్చని చెట్లు.. మధ్యలో నీరు.. నీటి ఉపరితలంపై నుంచి 15 మీటర్ల ఎత్తులో నడుచుకుంటూ వెళితే.. ఆ దృశ్యం మనస్సును హత్తుకుంటుంది.నగరవాసులకు ఇలాంటి అనుభూతిని పంచేందుకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్మెంట్ అథారిటీ(హెచ్ఎండీఏ) సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా లేక్ ఫ్రంట్ పార్కును సిద్ధం చేస్తోంది. సుమారు రూ.26 కోట్లతో 10 ఎకరాల్లో నిర్మిస్తున్న ఈ పార్కును మంత్రి కేటీ రామారావు త్వరలోనే ప్రారంభించనున్నారు.
సిటీబ్యూరో, సెప్టెంబర్ 19 (నమస్తే తెలంగాణ) :పచ్చని చెట్ల మధ్య నుంచి నడుచుకుంటూ నీటి పైకి ఎంచక్కా వెళ్లిపోవచ్చు. నీటి ఉపరితలం నుంచి 15 మీటర్ల ఎత్తులో చూస్తే అది ఒక అద్భుత దృశ్య కావ్యం అవుతుంది. అలాంటి నిజమైన అనుభూతిని పొందేందుకు హుస్సేన్సాగర్ తీరం వేదికగా మారనున్నది. నగర వాసులకే కాకుండా దేశ, విదేశీ పర్యాటకులకు టూరిస్టు ప్రాంతంగా పేరుగాంచిన హుస్సేన్సాగర్ ఇప్పుడు సరికొత్త హంగులతో కట్టుకోనున్నది.
హెచ్ఎండీఏ చేపట్టిన లేక్ ఫ్రంట్ పార్కును త్వరలోనే మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఇప్పటి వరకు హైదరాబాద్ మహానగరంలో ఎన్నో పార్కులు ఉన్నా, వాటికి పూర్తి భిన్నంగా.. అత్యాధునిక డిజైన్లు, సరికొత్త అనుభూతిని పొందేలా సాగర తీరంలో లేక్ ఫ్రంట్ పార్కును ఏర్పాటు చేశారు. సుమారు 10 ఎకరాల్లో రూ.26 కోట్ల వ్యయంతో అద్భుతంగా నిర్మించారు. నీటి పైకి వెళ్లేలా రెండు చోట్ల ఏర్పాటు చేసిన బోర్డు వాక్లు ప్రత్యేక ఆకర్షణగా నిలువనున్నాయి.
లేక్ ఫ్రంట్ పార్కు ఫీచర్లు..