ఆదివారం ఇనార్బిట్ దుర్గం చెరువు రన్ (ఐడీసీఆర్) -2024 ఉత్సాహంగా సాగింది. దివ్యాంగులు, ఎల్జీబీటీక్యూప్లస్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తులు చురుకుగా పాల్గొన్నారు. అంతకుముందు ఈ రన్ను మాదాపూర్ డీసీపీ డాక్టర్ వినీత్ జీ ముఖ్య అతిథిగా హాజరై
ప్రారంభించారు. రన్లో భాగంగా రూ. 60 లక్షల విరాళాలను సేకరించామని, వాటిని పీడబ్ల్యూడీ, ఎల్జీబీటీక్యూ, మహిళల
ఆర్థిక సాధికారత కోసం వినియోగిస్తామని నిర్వాహకులు తెలిపారు.