SCR | సిటీబ్యూరో, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ) : దక్షిణ మధ్య రైల్వే ఏర్పడినప్పటి నుంచి సరుకు రవాణా విభాగంలో గత నెలలో అత్యధికంగా 13.122 మిలియన్ టన్నుల సరుకు రవాణా చేసినట్లు సోమవారం దక్షిణ మధ్య రైల్వే జోన్ అధికారులు తెలిపారు. అలాగే ఎస్సీఆర్ రూ.1,296.73 కోట్ల సరుకు రవాణా ఆదాయాన్ని నమోదు చేసిందన్నారు. బొగ్గు, సిమెంట్, ఆహార ధాన్యాలు, ఎరువులు, ఉక్కు కర్మాగారాల కోసం ముడి పదార్థాలు రవాణా చేసినట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు.