చాంద్రాయణగుట్ట,సెప్టెంబర్ 2 : పాతబస్తీలో టీఆర్ఎస్ శ్రేణులు గులాబీ జెండా పండుగను ఉత్సాహంగా నిర్వహించారు. టీఆర్ఎస్ గౌలిపుర డివిజన్ అధ్యక్షుడు సీ.ఎం.ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో గౌలిపుర మార్కెట్లో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి యాకుత్పురా నియోజకవర్గం ఇంచార్జి సామ సుందర్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జెండాను ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయకులు బి.సాయిబాబా, టి.సంతోష్ కుమార్లతో పాటు పలువురు పాల్గొన్నారు.
లలితాబాగ్ బస్టాండ్ వద్ద టీఆర్ఎస్ నాయకుడు బి.పవన్రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో హైదరాబాద్ పార్లమెంట్ ఇంచార్జి పుస్తె శ్రీకాంత్ ముఖ్య అతిథిగా హాజరై గులాబీ జెండాను ఎగరవేశారు. కార్యక్రమంలో లలితాబాగ్ డివిజన్ అధ్యక్షుడు జమ్మిచెట్టు రాజు, ఆకుల శ్రీనివాస్, విష్ణుగౌడ్, విక్రమ్రెడ్డి, మహిళా నాయకురాలు మంజుల, భారతమ్మ పాల్గొన్నారు.
జంగమ్మెట్ డివిజన్లో టీఆర్ఎస్ నాయకుడు సభావత్ గిరిధర్ నాయక్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సెట్విన్ చైర్మన్ ఇలియాత్ అలీ బక్రీ హాజరై జెండాను ఎగరవేశారు. చాంద్రాయణగుట్టలో జుర్కీ రాజేందర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో శ్రీనివాస్గౌడ్, అనిల్ కుమార్ హాజరై జెండా ఎగరవేశారు.