ఖైరతాబాద్, ఫిబ్రవరి 5: మహాత్మా జ్యోతి రావు పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో ఏర్పాటు చేయాలన్న డిమాండ్ను రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం గౌరవించాలని మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. బీసీ హక్కుల సాధనే లక్ష్యంగా ఆవిర్భవించిన యునైటెడ్ పూలే ఫ్రంట్ నూతన కమిటీని సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో సోమవారం సాయంత్రం ఎన్నుకున్నారు. ముఖ్య అతిథిగా హాజరైన మధుసూదనాచారి మాట్లాడుతూ జ్యోతి రావు పూలే గొప్ప సంఘ సంస్కర్త అని కొనియాడారు. అసమానతలు లేని సమాజ నిర్మాణానికి, పేద, బడుగు వర్గాలు గౌరవప్రదమైన జీవితాన్ని గడుపాలన్న సంకల్పంతో ఆయన అనేక సంస్కణలు చేపట్టారన్నారు. జ్ఞానమే సకల సమస్యలకు పరిష్కారమని గ్రహించిన పూలె ఆ దిశగా పనిచేశారన్నారు. ఆయన సతీమణి సావిత్రిబాయి పూలె స్త్రీ విద్యకు ఎనలేని కృషి చేశారని గుర్తు చేశారు. చట్టసభల్లో ఉన్న వారికి ఆరాధ్యుడైన పూలె విగ్రహాన్ని అసెంబ్లీలో ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నదని, సమాజం నుంచి మంచి డిమాండ్ వచ్చినప్పుడు పాలకులు దానిని స్వీకరించాలన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్, కవి, రచయిత జూలూరు గౌరీ శంకర్ మాట్లాడుతూ కాళ్లకు గజ్జెలు కట్టిన కళాకారుల నుంచి కవులు, రచయితలు బీసీ హక్కుల సాధన కోసం పనిచేస్తారన్నారు. అందరి కోసం కలం పట్టామని, గొంతులు పగిలేలా అరిచామని, కాని నేడు మా కోసం నినదిస్తామన్నారు. యునైటెడ్ పూలె ఫ్రంట్ రాష్ట్రంలోని రెండున్నర కోట్లకు సంబంధించిన బీసీల గొంతుకగా నిలుస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు బీసీల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయని యూపీఎఫ్ నూతన కన్వీనర్ గట్టు రామచందర్ అన్నారు. అసెంబ్లీలో పూలె విగ్రహ స్థాపనే లక్ష్యంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సారథ్యంలో పోరాటాలకు సిద్ధమవుతామన్నారు. ఈ నెల 12న ఇందిరా పార్కు వద్ద మహా ధర్నా చేస్తామని తెలిపారు.
యునైటెడ్ పూలే ఫ్రంట్ నూతన కమి టీ సలహాదారులుగా రాజ్యసభ సభ్యులు ఆర్.కృష్ణయ్య, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్, కన్వీనర్గా గట్టు రామచంద్రరావు, కో కన్వీనర్లుగా తాడూ రి శ్రీనివాస్, కాసాని వీరేశ్ ముదిరాజ్, ఆర్జేసీ కృష్ణ, రాజారాం యాదవ్, బోల్ల శివశంకర్, కోల శ్రీనివాస్ , ముప్పు బిక్షపతి, రాచమల్ల బాలకృష్ణ, రాగిపెల్లి రవీం ద్ర చారి, ఆర్వీ మహేందర్, ప్రచార కార్యదర్శిగా ఏరుకొండ నర్సన్న, యూత్ వింగ్ కన్వీనర్గా ఆలకుంట హరిబాబు, విద్యా ర్థి విభాగం కన్వీనర్గా ఏల్చల దత్తాత్రేయ, కో కన్వీనర్లుగా అశోక్ యాదవ్, బొడ్డుపల్లి లింగం, మహిళా విభాగం కన్వీనర్లుగా బాలమణమ్మ, గీతా గౌడ్, బొమ్మ ప్రవళికలు ఎన్నికయ్యారు.