బన్సీలాల్పేట్ : మైనారిటీ సోదరులకు ప్రభుత్వం అన్ని విధాలుగా ప్రోత్సాహించి అండగా ఉంటుందని, వారికి ఎలాంటి సమస్య ఉన్న తన దృష్టి తీసుకురావాలని రాష్ట్ర సినిమాటోగ్రఫి, మత్స్య, పాడి, పశు సంవర్థక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
ఆదివారం బన్సీలాల్పేట్లో టీఆర్ఎస్ పార్టీ మైనారిటీ సెల్ నూతన కార్యాలయాన్ని కార్పొరేటర్ కే.హేమలతతో కలిసి ఆయన ప్రారంభించారు.తొలిసారిగా మైనారిటీ విభాగం ఒక ఆఫీస్ ఏర్పాటు చేసిన డివిజన్ అధ్యక్షుడు జావేద్, వారి కమిటిని మంత్రి అభినందించారు. ప్రభుత్వం ద్వారా అమలు జరుగుతున్న సంక్షేమ పథకాలను డివిజన్లోని పేద ప్రజలకు అందేలా చూడాలని ఆయన సూచించారు.
ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ పార్టీ మైనారిటీ సెల్ అధ్యక్షుడు షేక్ జావేద్, కార్యదర్శి శాహెద్, అన్వర్, రుక్ముద్దిన్, హుస్సేన్, ఆజమ్, రజాక్, ఫహీమ్, అబ్బాస్, ముకరమ్, అయూబ్, శాబుద్దిన్, చాంద్, జహంగీర్, టీఆర్ఎస్ నాయకులు తలసాని స్కైలాబ్ యాదవ్, జి.పవన్కుమార్ గౌడ్, కే.లక్ష్మిపతి, వెంకటేశన్ రాజు, ప్రేమ్కుమార్లు పాల్గొన్నారు.