శంషాబాద్ రూరల్, జనవరి 21 : గ్రామాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు. శనివారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ దిద్యాల జయమ్మశ్రీనివాస్ అధ్యక్షతన మండల సర్వసభ్యసమావేశం నిర్వహించారు. సమావేశానికి ము ఖ్యఅతిథిగా ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ పాల్గొన్నారు. సమావేశంలో గ్రామాల సర్పంచ్లు మాట్లాడుతూ గ్రామాల్లో సీసీరోడ్లు, డ్రైనేజీలు,రోడ్లకు ప్రత్యేక నిధులు కేటాయించాలని కోరారు. కరోనా సమయంలో ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయని ఆయా సర్వీసులను తిరిగి ప్రారంభించాలని అధికారులను కోరారు.
మండలంలోని పాలమాకుల గ్రామంలో ఉన్న మోడల్ పాఠశాలకు వెళ్లే విద్యార్థులతో పాటు ఆయా గ్రామాలలో చదువుకునే విద్యార్థులకు శంషాబాద్ పట్టణం నుంచి తొండుపల్లి, గండిగూడ, ఘాన్సిమియాగూడ,పెద్దషాపూర్, మదన్పల్లి, పాలమాకుల గ్రామాల మీదుగా పెద్దతూప్ర గ్రామం వరకు బస్సు సర్వీసులను ప్రారంభించాలని కోరారు. మండలంలోని పెద్దతూప్ర గ్రామంలో వెంకట చెరువు, పెరమళ్ల కుంట చెరువులు కబ్జాకు గురవుతున్నాయని వాటిని కబ్జా నుంచి కాపాడాలని సర్పంచ్ చిటికెల వెంకటయ్య ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ను కోరారు.
స్పందించిన ఎమ్మెల్యే రెవెన్యూ అధికారులు సర్వే చేసి హద్దురాళ్లను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. అనంతరం ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ మాట్లాడుతూ పల్లె ప్రగతి, పల్లె ప్రకృతి వనాలు,డంపింగ్యార్డులు, వైకుంఠధామాలు, ఇంటింటికీ తాగునీరందిస్తున్న ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్కే దక్కుతుందన్నారు. దీంతో పాటు కొత్తగా కంటి వెలుగు ను ప్రవేశపెట్టిన్నట్లు తెలిపారు. కంటి వెలుగును విజయవంతం చేయడం కోసం ప్రజాప్రతినిధులు ప్రత్యేక చొరవతీసుకోవాలన్నారు.
జడ్పీటీసీ నీరటి తన్విరాజు,వైస్ ఎంపీపీ నీలం నాయక్, ఎంపీడీవో వసంతలక్ష్మి, డీఈ సంజీవరెడ్డి, ఎంఈవో రాంరెడ్డి, ఎంపీవో ఉష, ఎంపీటీసీలు యాదయ్యగౌడ్, క్రాంతికుమార్, ఇందిరాదేవి, గౌతమి అశోక్, సంగీత, సర్పంచ్లు దండుఇస్తారి, సతీశ్యాదవ్, రాజ్కుమార్, లక్ష్మయ్య, వెంకటయ్య, రవీందర్నాయక్, కల్పన, మాధవి,దేవికజగన్గౌడ్ పాల్గొన్నారు.
అమ్మపల్లి బ్రహ్మోత్సవాలకు ఎమ్మెల్యేకు ఆహ్వానం
శంషాబాద్ రూరల్,జనవరి 21 : మండలంలోని నర్కూడ అమ్మపల్లి(సీతారామచంద్రస్వామి) దేవాలయం బ్రహ్మోత్సవాలు ఈ నెల 26,27,28 తేదీలలో నిర్వహిస్తున్నామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. వేడుకలకు హాజరుకావాలని ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ శనివారం ఆహ్వాన పత్రికను అందజేశారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో ఆలయ చైర్మన్ వినోద్కుమార్, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు నీరటి రాజుముదిరాజ్,ఆలయ ఈవో రామశర్మ, డైరెక్టర్లు నీరటి కృష్ణ, శ్రీనివా స్, గుండాల లావణ్య విశ్వనాథ్, అశోక్ ముదిరాజ్, మహేశ్, అర్చకులు సత్యనారాయణమూర్తి, అన్వేశ్శర్మ, క్లర్క శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.