నగర నడిబొడ్డున ఉన్న కేబీఆర్ నేషనల్ పారు చుట్టూ ట్రాఫిక్ కష్టాలను తీర్చేందుకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఫ్లై ఓవర్ల ప్రాజెక్టు న్యాయపరమైన చికుల్లో నలిగిపోతున్నది. పారు పరిసరాల్లో సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖుల నివాసాలు ఉండటం, వారి భూముల సేకరణపై సరైన విధానాలు లేకుండానే ప్రాజెక్టు పనులపై ముందుకు వెళుతుండడంపై సమస్యలను మరింత జఠిలం చేస్తున్నది. ఇప్పటికే కాంగ్రెస్ నేత, హీరో అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి తన ఇంటిని కాపాడాలని కోరుతూ హైకోర్టును ఆశ్రయించగా, మరికొందరు ప్రముఖులు కూడా అదే బాటలో నడిచారు.
పర్యావరణ పరిరక్షణ కోసం నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో నమోదైన కేసులు కూడా పెండింగ్లో ఉండటం గమనార్హం. బసవతారకం క్యాన్సర్ దవాఖాన సమీపంలోని భూ యజమానులు, ఒక ప్రముఖ న్యూస్ సంస్థ యాజమాన్యం కూడా కోర్టు మెట్లు ఎకడంతో ఈ ప్రాజెక్టు ఇప్పట్లో పట్టాలెకడం కష్టమనే అభిప్రాయం వ్యక్తమవుతున్న తరుణంలో తాజాగా భూసేకరణను సవాల్ చేస్తూ ఇటీవల కాలంలో మరో పది పిటిషన్లు దాఖలు కావడంతో మొత్తం పిటిషన్ల సంఖ్య అర్థ సెంచరీకి చేరువైంది. దీంతో ఒకటి , రెండు జంక్షన్లలో వివాదం లేని చోట పనులు ప్రారంభించగా..ఇతర కీలక జంక్షన్లలో ప్రాజెక్టు ముందుకు సాగే పరిస్థితి లేక
అధికారులు తలలు పట్టుకుంటున్నారు.
సిటీబ్యూరో, మే 5 (నమస్తే తెలంగాణ) : కేబీఆర్ పారు చుట్టూ ట్రాఫిక్ నివారణ కోసం ఏడు స్టీల్ ఫ్లై ఓవర్లు, మరో ఏడు అండర్ పాస్లను నిర్మించేందుకు సరారు కూడా పరిపాలనపరమైన అనుమతులు మంజూరు చేయడం, భూ సేకరణపై స్పష్టత లేకుండా ఆగమేఘాల మీద టెండర్లు పిలిచి ఏజెన్సీని ఖరారు చేసింది. ప్రాజెక్టుల నిర్మాణం, యుటిలిటీల బదలాయింపుకు కలుపుకుని మొత్తం వ్యయం రూ, 1,090 కోట్లు కాగా, ఒక కేబీఆర్ పారు చుట్టూ ఆరు జంక్షన్ల వద్ద చేయాల్సిన స్థల సేకరణతో పాటు ఇతర ప్రాంతాలైన విరంచి హాస్పిటల్, ఎన్ఎఫీ సీ, టీవీ 9 జంక్షన్లతో కలుపుకుని కేవలం స్థల సేకరణకు రూ. 1543.82 కోట్ల వరకు ఖర్చవుతున్నట్లు అధికారులు లెకలేశారు.
ఈ తరుణంలోనే ప్రాజెక్టు పురోగతిలో ఉందని చూపించేందుకు అధికారులు వివాదాలు లేని ఒకటి రెండు జంక్షన్లలో పనులు మొదలుపెట్టి హడావుడి చేస్తున్నారు. కానీ, అసలైన ఆరు జంక్షన్ల వద్ద భూసేకరణ ప్రక్రియ ఎకడి వేసిన గొంగళి అకడే అన్న చందంగా మారింది. మారింగ్ పూర్తయినా, కోర్టు స్టేల వల్ల ప్రాజెక్టు ఇతర చోట్ల ముందుకు కదలడం లేదు. న్యాయపరమైన చికులు, నిధుల కొరత వెరసి.. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టు భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. అన్నింటి కంటే మించి భూ సేకరణకు తోడుగా టీడీఆర్లను యాజమానులను తిరస్కరిస్తుండడం గమనార్హం.