బన్సీలాల్పేట్ : ప్రజలు బోనాల పండుగను ప్రశాంతంగా, ఆనందంగా జరుపుకోవాలన్నదే ప్రభుత్వ ఆశయమని రాష్ట్ర సినిమాటోగ్రఫి, మత్స్య, పాడి, పశు సంవర్థక శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. ఆదివారం న్యూబోయిగూడలోని రైల్ కళారంగ్ బస్తీలో ఉన్న శ్రీ నల్లపోచమ్మ దేవాలయంలో జరిగిన బోనాల ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. బన్సీలాల్పేట్ కార్పొరేటర్ కె.హేమలత, ఆలయ నిర్వాహకులు అలకుంట గణేశ్, జితేంద్ర కపూర్, కృష్ణ, శంకర్ పటేల్, శ్రీను, విజయ్, వెంకట్, ప్రవీణ్, ప్రసాద్, నర్సింగ్రావు, ప్రభు, నరేందర్, శివ, బస్తీ అధ్యక్షుడు మహ్మద్ అక్బర్, టీఆర్ఎస్ నాయకులు కె.లక్ష్మిపతి, వెంకటేశన్రాజు, దేశపాక శ్రీను, కుమార్ యాదవ్, దేవెందర్ తదితరులు పాల్గొన్నారు. గాంధీ దవాఖాన ఆవరణలో ఉన్న శ్రీబంగారు మైసమ్మ ఆలయంలో జరిగిన బోనాల ఉత్సవాలలో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరై పూజా కార్యక్రమాలలో పాల్గొన్నారు.