కొండాపూర్ : మతిస్థిమితం సరిగా లేని మహిళ ఇంటినుంచి వెళ్ళిపోయిన సంఘటన చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గంగారంలో నివాసం ఉండే సరల వరప్రసాద్ తల్లి నిర్మల(45) కు మతిస్థిమితం సరిగా లేకపోవడంతో గత కొంతకాలంగా చికిత్స చేయిస్తున్నారు. కాగా ఆగస్టు 10న రాత్రి భోజనం అనంతరం వాష్రూం వెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లింది. అలా వెళ్లిన నిర్మల ఎంతకీ తిరిగిరాకపోవడంతో చుట్టు పక్కల, తెలిసిన వారిని ఆరాతీయగా ఎలాంటి సమాచారం లభించకపోవడంతో బుధవారం ఉదయం చందానగర్ పోలీసులను ఆశ్రయించినట్లు తెలిపారు. ఈ మేరకు సరల వరప్రసాద్ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చందానగర్ పోలీసులు తెలిపారు.