మహేశ్వరం : మున్సిపాలిటీల అభివృద్ధె టీఆర్ఎస్ ప్రభుత్వ ద్యేయమని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని 10,11,13,15 వ వార్డులల్లో 90 లక్షల రూపాయలతో సీసీరోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజి, ఓపెన్ జిమ్ పనులకు వైస్ చైర్మన్ భవాని వెంకట్రెడ్డితో కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ పట్టణాలను అభివృద్ధి పరుస్తూ అభివృద్ధి ప్రదాతగా నిలుస్తు, బంగారు తెలంగాణ నిర్మాణానికి బాటలు వేస్తున్నారని ఆమె అన్నారు. తెలంగాణ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలను రెండు కళ్ల లాగ చూస్తు ముందుకు సాగుతుందని ఆమె అన్నారు.
పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో పట్టణాలకు నూతన హంగులు కలిపిస్తున్నారని ఆమె అన్నారు. తెలంగాణ ప్రభుత్వ పథకాలను ఇతర రాష్ట్రాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయని ఆమె అన్నారు. కోట్లాది రూపాయల నిధులను పట్టణాల అభివృద్ధి చేపడుతున్నామని ఆమె అన్నారు.
ఇటీవల రూపాయలు 371 కోట్లతో నియోజక వర్గ పట్టణ ప్రాంతానికి కేటీఆర్ చేతుల మీదుగా శ్రీకారం చుట్టడం జరిగిందని ఆమె అన్నారు. జరుగుతున్న పనులను నాణ్యతో పూర్తి చేసి త్వరిత గతిన ప్రజలకు అందుబాటులోకి తీసుకరావాలని ఆమె అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో కమీషనర్ జ్ఞానేశ్వర్, మేనేజర్ పర్వతాలు కౌన్సిలర్లు బాధావత్ రవినాయక్, సప్పిడి లావణ్యరాజు ముదిరాజ్, బూడిద తేజస్విని శ్రీకాంత్గౌడ్, రెడ్డిగళ్లసుమన్ మున్సిపాలిటీ అద్యక్షులు జిల్లెల లక్ష్మయ్య, మహిళా అద్యక్షురాలు పద్మబాస్కర్రెడ్డి, యూత్ అద్యక్షులు సామ్యూల్ రాజు తదితరులు పాల్గొన్నారు.