హైదరాబాద్ : ఉరేసుకొని అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన నగరంలోని ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి దత్తాత్రేయ కాలనీలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. మృతుడి అన్న పవన్ కుమార్ కథనం మేరకు..అతడి తమ్ముడు కమల్ కుమార్
నిన్న రాత్రి ఏడున్నర గంటల సమయంలో ఇంట్లో ఫ్యాన్కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొన్నాడు.
తాను మార్కెట్కు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేసరికి చూడగా తమ్ముడు కమల్ కుమార్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చానని తెలిపాడు. సంఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు కేసు నమోదు చేసి ఇది హత్యా లేదా ఆత్మహత్య అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా దవాఖానకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.