బంజారాహిల్స్,ఏప్రిల్ 17: తమ మతవిశ్వాసాలను ఆచరించడంతో పాటు అన్ని మతాలను గౌరవించడమే హైదరాబాద్ సంస్కృతి అని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. వెంకటేశ్వరకాలనీ డివిజన్ పరిధిలోని దేవరకొండబస్తీ, రోడ్ నెం 10లోని మజీదు వద్ద ఆదివారం రంజాన్ కానుకల పంపిణీ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దానం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దానం మాట్లాడుతూ.. గంగా జమునా తెహజీబ్కు నిజమైన నిర్వచనంగా హైదరాబాద్ ప్రజలు జీవిస్తున్నారని అన్నారు.
అన్ని మతాల్లో పేదలున్నారని, అలాంటి పేదలకు పండుగల ఆనందాన్ని పంచడమే టీఆర్ఎస్ ప్రభుత్వ లక్ష్యమన్నారు. మతాలమధ్యన చిచ్చుపెట్టే వారిపట్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ మన్నె కవితారెడ్డి, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు రాములు చౌహాన్,నాయకులు జావెద్, అక్బర్ తదితరులు పాల్గొన్నారు.