సిటీబ్యూరో, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి అదనపు డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ హోదాలో మంగళవారం పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో కోర్టు నిర్వహించారు. బంజారాహిల్స్కు చెందిన ఐదుగురు రౌడీషీటర్లను బంజారాహిల్స్ ఇన్స్పెక్టర్ రాఘవేంద్ర కోర్టు ఎదుట హాజరుపరిచారు. సయ్యద్ మజీద్ అలియాస్ బెంగాలీ, డాక్టర్, మహ్మద్ నియముతుల్లా అలియాస్ మహ్మద్ అమీర్, టార్జన్, మిర్జా హరూన్ బేగ్ అలియాస్ మిర్జాలు బంజారాహిల్స్ ఠాణాలో రౌడీషీటర్లు.
సయ్యద్ ఐజాజ్ అలియాస్ గోలి అసీఫ్నగర్లో, సయ్యద్ సాజీద్పై మాసబ్ట్యాంక్ ఠాణాలో రౌడీషీట్లు నమోదయ్యాయి. హత్యలతో పాటు వివిధ నేరాలలో నిందితులుగా ఉన్నారు. దీంతో రౌడీషీటర్లను కోర్టులో హాజరుపరిచి, సంవత్సరం వరకు సత్ప్రవర్తనతో ఉండాలని, అందుకు రూ. 50 వేల ఎగ్జిక్యూట్ బాండ్లతో పాటు ఒక్కొక్కరికి ఇద్దరు ష్యూరిటీలను తీసుకున్నారు.