ఎల్బీనగర్ : తెలంగాణ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా అభివృద్ది చేస్తున్న సీఎం కేసీఆర్ సేవలు దేశానికి అవసరమని ఎమ్మెల్సీ, మాజీ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి, ఎల్బీనగర్ ఎమ్మెల్యే, ఎంఆర్డీసీ ఛైర్మన్ దేవిరెడ్డి సుధీర్రెడ్డిలు అన్నారు.
గురువారం చైతన్యపురిలో సీనియర్ టీఆర్ఎస్ నాయకులు విశ్వప్రేమ్కుమార్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిభిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేక్ను ఎమ్మెల్యే సుధీర్రెడ్డి, ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్గుప్తాలు కట్ చేశారు.
ఈ సందర్భంగా మధుసూదనాచారి, సుధీర్రెడ్డిలు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక విజన్తో అభివృద్ది చేస్తున్న మహోన్నత వ్యక్తి సీఎం కేసీఆర్ అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు బొగ్గారపు దయానంద్గుప్తా, భానుప్రసాద్, గడ్డిఅన్నారం మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ పుటం పురుషోత్తంరావు, మాజీ కార్పొరేటర్ జీవీ సాగర్రెడ్డి, సీనియర్ నాయకులు కుంట్లూరు వెంకటేష్ గౌడ్, కొత్తపేట డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు లింగాల రాల్గౌడ్, చైతన్యపురి యూత్ అధ్యక్షుడు ఎస్. చంద్రశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.