బంజారాహిల్స్,ఆగస్టు 17 : ప్రముఖ నిర్మాణ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ నివాసంలో రూ. 8లక్షల నగదు మాయమయ్యాయి. జూబ్లీహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. జూబ్లీహిల్స్ రోడ్ నెం 25లో నివాసం ఉంటున్న నాగార్జున కన్స్ట్రక్షన్స్ కంపెనీ సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఏజీకే రాజు నివాసంలోని గదిలో కప్బోర్డులో ఈనెల 13న రూ.8లక్షల నగదు మాయమైంది.
ఇంట్లో పనిచేస్తున్న వారిని ప్రశ్నించగా తమకు తెలియదని సమాధానం ఇచ్చారు. ఈ మేరకు సంస్థలో మేనేజర్గా పనిచేస్తున్న జి.కృపాకర్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గదిలోకి వెళ్లేందుకు పనిమనుషులు గణేష్, శంకర్, సునీతలకు మాత్రమే అనుమతి ఉందని, డబ్బులు వారే తస్కరించి ఉండవచ్చని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు విచారణ చేపట్టారు.